Tuesday, December 10, 2013

ఢిల్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బీజేపీ, ఆం అద్మీ పార్టీలు ప్రతిపక్షంలో కూచుంటామంటూ ప్రకటించడంతో నెలకొన్న అనిస్చిత పరిస్థితిపై నా స్పందన

ఢిల్లీలో ఆం ఆద్మీ 
చీపురెట్టి ఊడ్చినా
కాంగిరేసుకి బుద్ధి రాదు
ఎంతసేపు ఏడ్చినా 

చేవలేని రాహులే
దేవుడంట వీళ్ళకి
డెమోక్రసీ ఇంజను
నడుస్తుందా నీళ్ళకి? 

ప్రతిపక్షం మాదంటూ
బిగుసుకున్న కేజ్రీవాలు
ఇంతలోనే చదివాడా
ఉద్ధండుల అనుభవాలు

అందుకుంటె తప్పేంటట 
కాంగిరేసు హస్తం 
అధికారం మీ చేతికిచ్చి 
అసలు రంగు మేం చూస్తాం  

చేతులు కట్టుకు కూచున్నారు
ఎందుకో బీజేపీ బేరగాళ్ళు 
లేదంటే దొరక్కపోరు 
ఒకరిద్దరు మాయగాళ్ళు 

మళ్ళీ ఎన్నికలొస్తే 
ప్రజలకేగా నష్టం
ఎన్నాళ్ళకు తీరుతుందో 
దేశానికి అరిష్టం