Thursday, October 27, 2011

ఒకప్పుడు

ఒకప్పుడు భూమ్మీద మనుషులుండేవారట
మంచితనం, మర్యాద పంచుతుండేవారట.

ఏవైపు చూసినా పచ్చదనం వుండేదట
నదీ పరివాహకాల్లో నాగరికత విరిసేదట.

ఏనోటి మాట విన్నా మనసు పులకరించేదట
ఏఇంటి తలుపు తట్టినా ఆప్యాయత పలకరించేదట.

శ్రమైక జీవన సౌందర్యం అనుభవించేవారట
చెరపకురా చెడేవు అని చెప్పుకునేవారట.

ఆ రోజులు పోయాయి, అవతారాలు మారాయి
విలువలు తరిగాయి, స్వార్ధాలు పెరిగాయి  

నేడు భూమ్మీద వున్న జనం మనుషులు కానేకారు
యాంత్రికంగా బతుకు లాగే మరమనుషులు వీరు

జురాసిక్కు పార్కులో స్పీలుబర్గు చూపించినట్లు
రాక్షస బల్లుల్లా మనుషులు మళ్ళీ పుడతారట 

అమ్మ నన్ను ఈరోజు జూకి తీసుకెడుతోంది
మనుషుల్ని చూపిస్తా రారమ్మని అంటోంది

అంతరించిపోతున్న మనిషి జాతీ వందనం
ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడో కలుద్దాం మనమందరం!!!!

No comments:

Post a Comment